వరాహ:
బ్రహ్మ పుత్రులైన సనక,సనందన,సనాతన,సనత కుమారులు విష్ణువు దర్శనం కోసం వైకుంటం వస్తారు. ద్వార పాలకులైన జయ, విజయులు , ఆ ఋషులు దిగంబరులై ఉండటం వల్ల వాళ్ళని అడ్డుకుంటారు.ఆ ఋషులు కోపోద్రిక్తులై మిగతా జన్మలన్నీ భూమి మీద పుట్టమని శపిస్తారు. శ్రీ మహా విష్ణువు ని వదిలి ఉండలేని జయ,విజయ లు విష్ణువు ని వేడుకుంటారు శాప విమోచనం కోసం. విష్ణువు 7 జన్మలు మంచి వాళ్ళలా పుడతారా లేక 3 జన్మలు రాక్షసులు గా పుడతారా అనగా మేము 7 జన్మలు మిమ్మల్ని విడిచి ఉండలేము అని 3 జన్మలు రాక్షసులు గా పుట్టడానికి అంగీకరిస్తారు. హిరణ్యాక్షుడు - హిరణ్యకశిపుడు, రావణుడు - కుంబకర్ణుడు, శిశుపాలుడు - దంతవక్త్రుడు గా పుడతారు.
హిరణ్యాక్షుడు పాపాలు చేస్తూ దేవతల్ని యుద్ధానికి ఉసి గొల్పుతూ ఉంటాడు. దేవతల్ని జయించి విష్ణువు ని ఉసి గోల్పడానికి భూమి ని పాతాళం లో దాచేస్తాడు. దేవతలు విష్ణువు ని వేడుకోగా బ్రహ్మ ముక్కు నుండి చిన్న వరాహం పుడుతుంది. ఆ చిన్న వరాహం బ్రహ్మ చూస్తుండగానే భారీ ఆకారం గా మారి పాతాళం లో ఉన్న భూమి ని తన కొమ్ము పైన పెట్టుకుని హిరణ్యక్షుడితో యుద్ధానికి దిగుతాడు. 1000 సంవత్సరాల యుద్ధం తర్వాత విష్ణువు హిరణ్యక్షుడిని సంహరిస్తాడు.
నరసింహావతారం:
హిరణ్యకశిపుడు బ్రహ్మ గురించి గోరమైన తపస్సు చేసి ఒక వరం పొందుతాడు. ఆ వరం ఏమంటే "మనిషి చేత గాని ,జంతువు చేత గాని , బయట గాని ,లోపల గాని, భూమి మీద గాని,అంతరిక్షం లో గాని,జీవం ఉన్న ఆయుధం తో గాని, జీవం లేని ఆయుధం తో గాని మరణం లేకపోవడం". హిరణ్యకశిపుడు తనని తాను దేవుడి గా ప్రకటించుకుని విష్ణువు ప్రార్థన మాని తన ప్రార్థన చెయ్యాలని హింసిస్తూ ఉంటాడు. కొన్ని సంవత్సరాలకి హిరణ్యకసిపుడికి ప్రహ్లాదుడు జన్మిస్తాడు. ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడిగా మారుతాడు అది నచ్చని హిరణ్యకశిపుడు కొడుకుని దండించాలని చూస్తాడు. అయినా ప్రహ్లాదుడు విష్ణు నామస్మరణం మానడు . ప్రహ్లాదుడిని అనేక రకాలుగా చంపడానికి చూస్తాడు హిరణ్యకశిపుడు. అన్ని ప్రయత్నాలు విఫలం చెందుతాయి. ప్రహ్లాదుడిని విష్ణువు ఎక్కడున్నాడో చూపించమని అడగగా జగమంతా విష్ణువే అని చెబుతాడు. అయితే ఈ గోడ నుండి విష్ణువు ని రమ్మను అని గోడ బద్దలు కొడతాడు . విష్ణువు నరసింహావతారం(మనిషి కాదు జంతువు కాదు) లో వచ్చి ద్వారం దగ్గర(బయట కాదు ,లోపల కాదు ) తన వొడిలో(భూమి మీద కాదు ,అంతరిక్షం లో కాదు ) పడుకోబెట్టి గోళ్ళతో(జీవం ఉన్న ఆయుధం తో గాని, జీవం లేని ఆయుధం తో గాని) పొట్ట చీల్చి చంపుతాడు .
పైవన్నీ సత్యయుగ అవతారాలు .............
త్రేతాయుగ అవతారాలు తర్వాత పోస్ట్ లో ...................
బ్రహ్మ పుత్రులైన సనక,సనందన,సనాతన,సనత కుమారులు విష్ణువు దర్శనం కోసం వైకుంటం వస్తారు. ద్వార పాలకులైన జయ, విజయులు , ఆ ఋషులు దిగంబరులై ఉండటం వల్ల వాళ్ళని అడ్డుకుంటారు.ఆ ఋషులు కోపోద్రిక్తులై మిగతా జన్మలన్నీ భూమి మీద పుట్టమని శపిస్తారు. శ్రీ మహా విష్ణువు ని వదిలి ఉండలేని జయ,విజయ లు విష్ణువు ని వేడుకుంటారు శాప విమోచనం కోసం. విష్ణువు 7 జన్మలు మంచి వాళ్ళలా పుడతారా లేక 3 జన్మలు రాక్షసులు గా పుడతారా అనగా మేము 7 జన్మలు మిమ్మల్ని విడిచి ఉండలేము అని 3 జన్మలు రాక్షసులు గా పుట్టడానికి అంగీకరిస్తారు. హిరణ్యాక్షుడు - హిరణ్యకశిపుడు, రావణుడు - కుంబకర్ణుడు, శిశుపాలుడు - దంతవక్త్రుడు గా పుడతారు.
హిరణ్యాక్షుడు పాపాలు చేస్తూ దేవతల్ని యుద్ధానికి ఉసి గొల్పుతూ ఉంటాడు. దేవతల్ని జయించి విష్ణువు ని ఉసి గోల్పడానికి భూమి ని పాతాళం లో దాచేస్తాడు. దేవతలు విష్ణువు ని వేడుకోగా బ్రహ్మ ముక్కు నుండి చిన్న వరాహం పుడుతుంది. ఆ చిన్న వరాహం బ్రహ్మ చూస్తుండగానే భారీ ఆకారం గా మారి పాతాళం లో ఉన్న భూమి ని తన కొమ్ము పైన పెట్టుకుని హిరణ్యక్షుడితో యుద్ధానికి దిగుతాడు. 1000 సంవత్సరాల యుద్ధం తర్వాత విష్ణువు హిరణ్యక్షుడిని సంహరిస్తాడు.
నరసింహావతారం:
హిరణ్యకశిపుడు బ్రహ్మ గురించి గోరమైన తపస్సు చేసి ఒక వరం పొందుతాడు. ఆ వరం ఏమంటే "మనిషి చేత గాని ,జంతువు చేత గాని , బయట గాని ,లోపల గాని, భూమి మీద గాని,అంతరిక్షం లో గాని,జీవం ఉన్న ఆయుధం తో గాని, జీవం లేని ఆయుధం తో గాని మరణం లేకపోవడం". హిరణ్యకశిపుడు తనని తాను దేవుడి గా ప్రకటించుకుని విష్ణువు ప్రార్థన మాని తన ప్రార్థన చెయ్యాలని హింసిస్తూ ఉంటాడు. కొన్ని సంవత్సరాలకి హిరణ్యకసిపుడికి ప్రహ్లాదుడు జన్మిస్తాడు. ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడిగా మారుతాడు అది నచ్చని హిరణ్యకశిపుడు కొడుకుని దండించాలని చూస్తాడు. అయినా ప్రహ్లాదుడు విష్ణు నామస్మరణం మానడు . ప్రహ్లాదుడిని అనేక రకాలుగా చంపడానికి చూస్తాడు హిరణ్యకశిపుడు. అన్ని ప్రయత్నాలు విఫలం చెందుతాయి. ప్రహ్లాదుడిని విష్ణువు ఎక్కడున్నాడో చూపించమని అడగగా జగమంతా విష్ణువే అని చెబుతాడు. అయితే ఈ గోడ నుండి విష్ణువు ని రమ్మను అని గోడ బద్దలు కొడతాడు . విష్ణువు నరసింహావతారం(మనిషి కాదు జంతువు కాదు) లో వచ్చి ద్వారం దగ్గర(బయట కాదు ,లోపల కాదు ) తన వొడిలో(భూమి మీద కాదు ,అంతరిక్షం లో కాదు ) పడుకోబెట్టి గోళ్ళతో(జీవం ఉన్న ఆయుధం తో గాని, జీవం లేని ఆయుధం తో గాని) పొట్ట చీల్చి చంపుతాడు .
పైవన్నీ సత్యయుగ అవతారాలు .............
త్రేతాయుగ అవతారాలు తర్వాత పోస్ట్ లో ...................
0 comments:
Post a Comment