నిన్న ఉదయం లేవగానే ఈనాడు పేపర్ తెరచిన వెంటనే మొదటి పేజి లో "ఢిల్లీ లో అత్యాచార ఘటన " అని హెడ్డింగ్ కనపడింది చదవడం మొదలు పెట్టా. మృగాలాంటి ఆరుగురు మగాళ్ళు ఒక వైద్య విద్యార్థిని ని అత్యాచారం చేసి బస్సు నుండి బయటకు విసిరేసారు. ఇదీ న్యూస్ . అందరిలాగే బాధపడ్డా. ఢిల్లీ లో రేప్ లు ఎక్కువయిపోతునాయి అని అనుకున్నా. ఎప్పటిలాగే ఫేస్ బుక్ తెరిచా . అక్కడా అదే న్యూస్ . బ్లాగ్స్ ,ఆన్లైన్ పేపర్స్ చదవడం మొదలుపెట్టా. ఆమె ని ఆరుగురు రేప్ చేసి రాడ్ తో తీవ్రంగా కొట్టి రోడ్ పైన పడేసారంట . ఆమె కోమా లో ఉంది . ప్రేగులు బాగా దెబ్బతిన్నాయి . డాక్టర్ ఆమె పరిస్థితి చూసి షాక్ తిన్నాడు. నాలుగు రోజుల్లో ఆరు సార్లు కోమా లోకి వెళ్ళింది .ఆ మృగాలు చేసిన పనేంటంటే ఆమె ని పెళ్లి కి పని చేయకుంట చేసేసారు. ఆమె మర్మాంగం ,ప్రేగులు బాగా దెబ్బ తిన్నాయి. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఈ వార్త చదవగానే మనసంతా ఏదో లా అయిపొయింది . నిజంగా మనకి స్వంతంత్రం వచ్చిందా? అని అనిపించింది. ప్రాబ్లెమ్ ఎక్కడ ఉందా అనిపించింది .
మొఘలులు కాలం లో ఆడపిల్లల్ని ఏడిపించిన ఒక అంతర్గత బద్రతాధికారి కి మరణ శిక్ష విదిన్చారంట . ఏనుగులతో తోక్కిన్చేవరంట. కళ్ళు పీకిన్చేవరంట . అలాంటి శిక్షలు మళ్ళి అమలు చెయ్యలా ? అనిపించింది .
ఒక్కటి మాత్రం నిజం మన చట్టాలు మాత్రం మార్చాలి . అంబేద్కర్ అప్పటి ప్రజల్ని చూసి చట్టాలు చేసారు . అప్పటి ప్రజలకి ఆడవాలంటే గౌరవమ్ ,మర్యాద ఉండేవి .ఇప్పటి కాలం లో మనుషులు మారారు . చట్టాలు కూడా మారాలి.
నాయకులూ మారాలి . జనాలు న్యాయం కోసం రోడ్ మీదకు వచ్చే పరిస్థితి ఉంది ఈ దేశం లో. మొన్న జెస్సికా లాల్ కోసం , నిన్న ఇందిరా ప్రియదర్శిని కోసం ,ఈరోజు ఈమె కోసం. ప్రజలే పాలకులకు ఏం చేయాలో చెప్పాలా? వాళ్ళ బాధ్యత కాదా? మనల్ని రక్షించటం . వాళ్ళ చెల్లెళ్ళు,అక్కలు,బంధువులు కి Z-category రక్షణ ఉంటె చాలా ? మనకి సాధారణ రక్షణ కూడా ఇవ్వరా? ఈ విషయం జరిగిన వెంటనే బస్సు కిటికిలకి నల్ల అద్దాలు తీసేస్తాం ,curtains తీసేస్తాం ,డ్రైవర్ పేరు బస్సు లో రాయిస్తాం అని వెంట వెంటనే నిర్ణయాలు తీసుకున్నారు కదా ? కనీస safety measures ముందే ఎందుకు ఆలోచించరు ? ఎపుడూ అంతా అయిపోయిన తర్వాతే ఎందుకు పాలకులు
మేలుకుంటారు? ఢిల్లీ రేప్ పై స్పందిస్తూ రాజ్యసభ లో ఒక MP నాకు 17 ఏళ్ళ కూతురు ఉంది ఇలాంటి విషయాలు వింటుంటే భయం వేస్తుంది అంటే, సామాన్యుల పరిస్థితి ఏంటి? 6 PM దాటిన తర్వాత అమ్మాయిలని ఇంట్లోనే ఉంచాలా?
మొఘలులు కాలం లో ఆడపిల్లల్ని ఏడిపించిన ఒక అంతర్గత బద్రతాధికారి కి మరణ శిక్ష విదిన్చారంట . ఏనుగులతో తోక్కిన్చేవరంట. కళ్ళు పీకిన్చేవరంట . అలాంటి శిక్షలు మళ్ళి అమలు చెయ్యలా ? అనిపించింది .
ఒక్కటి మాత్రం నిజం మన చట్టాలు మాత్రం మార్చాలి . అంబేద్కర్ అప్పటి ప్రజల్ని చూసి చట్టాలు చేసారు . అప్పటి ప్రజలకి ఆడవాలంటే గౌరవమ్ ,మర్యాద ఉండేవి .ఇప్పటి కాలం లో మనుషులు మారారు . చట్టాలు కూడా మారాలి.
నాయకులూ మారాలి . జనాలు న్యాయం కోసం రోడ్ మీదకు వచ్చే పరిస్థితి ఉంది ఈ దేశం లో. మొన్న జెస్సికా లాల్ కోసం , నిన్న ఇందిరా ప్రియదర్శిని కోసం ,ఈరోజు ఈమె కోసం. ప్రజలే పాలకులకు ఏం చేయాలో చెప్పాలా? వాళ్ళ బాధ్యత కాదా? మనల్ని రక్షించటం . వాళ్ళ చెల్లెళ్ళు,అక్కలు,బంధువులు కి Z-category రక్షణ ఉంటె చాలా ? మనకి సాధారణ రక్షణ కూడా ఇవ్వరా? ఈ విషయం జరిగిన వెంటనే బస్సు కిటికిలకి నల్ల అద్దాలు తీసేస్తాం ,curtains తీసేస్తాం ,డ్రైవర్ పేరు బస్సు లో రాయిస్తాం అని వెంట వెంటనే నిర్ణయాలు తీసుకున్నారు కదా ? కనీస safety measures ముందే ఎందుకు ఆలోచించరు ? ఎపుడూ అంతా అయిపోయిన తర్వాతే ఎందుకు పాలకులు
మేలుకుంటారు? ఢిల్లీ రేప్ పై స్పందిస్తూ రాజ్యసభ లో ఒక MP నాకు 17 ఏళ్ళ కూతురు ఉంది ఇలాంటి విషయాలు వింటుంటే భయం వేస్తుంది అంటే, సామాన్యుల పరిస్థితి ఏంటి? 6 PM దాటిన తర్వాత అమ్మాయిలని ఇంట్లోనే ఉంచాలా?
0 comments:
Post a Comment