ఢిల్లీ రేప్ ఘటన పైన మన ప్రభుత్వ పెద్దలు స్పందించిన తీరు నీరో చక్రవర్తి చందాన ఉంది.
రోమ్ నగరానికి చక్రవర్తైన నీరో రోమ్ నగరం తగలపడిపోతుంటే రోమ్ అవతల ఫిడేల్ వాయిస్తూ గడిపాడని ఒక చారిత్రిక విమర్శ ఉంది.
మన పాలకుల పరిస్థితి కూడా అలానే ఉంది.
మన గౌర్వనీయిలైన CM గారిని స్పందించమంటే అక్కడెక్కడో జరిగిన సంఘటన కి నేనెందుకు స్పందించాలి అన్నారు. మన CM గారు ఇక్కడ ఒక ప్రాథమిక విషయాన్ని మరిచిపోయారు. చిన్నపుడు స్కూల్ స్టార్ట్ అయ్యేది ఒక ప్రతిజ్ఞ తో - "all indians are my brothers and sisters ani......భారతీయులందరూ నా సహోదరులు....". మరి ఈ విషయం మరిచిపోయినట్టున్నారు. లేకపోతే ఢిల్లీ ఏ యుక్రెయిన్ లోనో ఇరాన్ లోనో ఉందని అనుకున్నారో ఆయనకే తెలియాలి. లేక ఏం మాట్లాడితే ఏం వివాదం జరుగుతుందో అని భావించారో .
మన PM గారు నోరు విప్పడానికి వారం రోజులు పట్టింది.
మనల్ని కాపాడాల్సిన మన HM గారిని వెళ్లి ధర్నా చేస్తున్న విద్యార్థులతో మాట్లాడండి అంటే వాళ్ళలో mavoists (నక్సలైట్) లు ఉన్నారేమో అన్నారు......
ఇంక మన PCC అధ్యక్షుడు గారు "ఆడవాళ్ళు అర్ధరాత్రి తిరగడం ఎందుకు స్వతంత్రం వచ్చినంత మాత్రాన" అన్నారు.తర్వాత ఉపసంహరించుకున్నారనుకోండి. 9:30 PM కూడా అర్ధరాత్రా?
ఈ ఘటన సగటు భారతీయుడిని కలచివేసిన కారణం ఇంత అభద్రత లో మనం బతుకుతున్నాం అనే భయం. మరి మన పాలకుల లైట్ గా ఎందుకు తీసుకున్నారు ? వాళ్ళకి,వాళ్ళ బంధువులకి Z-category భద్రత ఉండటమేనా?
మనం పాశ్చాత్య దేశాల నుండి ఒక విషయం నేర్చుకోవాలి - ఒక ఘటన జరిగితే వాళ్ళు స్పందించే తీరు మరియు త్వరగా శిక్షలు అమలు చేసే విధానం .
కెనడా లో 12 నుండి 18 సం . శిక్ష
ఫ్రాన్స్ లో 15 నుండి 30 సం . శిక్ష
న్యూజిలాండ్ లో 12 సం.
జపాన్ లో 10 సం.
UK లో జీవిత కాలం జైలు లో గడపాల్సిందే.
అరబ్ దేశాలలో మరణ శిక్ష.
భారత దేశం లో కూడా sec 376 IPC ప్రకారం 10 సం. శిక్ష. కాని అమలు చేసే విధానం లో జాప్యం.
30 రేప్ కేసు లు 10 సం.నుండి కోర్ట్ తీర్పు కి నోచుకోలేదు. విద్యార్ధులు రోడ్ ల పైకి వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే శిక్షలు తొందరగా అమలు అవుతాయన్న నమ్మకం లేక, న్యాయం జరుగుతుందన్న నమ్మకం సన్నగిల్లడం వల్ల .
"justice delayed is justice denied " - ఈ విషయం మనవాళ్ళు తెలుసుకుని తొందరగా న్యాయం చేస్తే బాగుంటుంది. లేకపోతే జనాలు తిరగబడతారు . కాదు తిరగబడ్డారు .
రోమ్ నగరానికి చక్రవర్తైన నీరో రోమ్ నగరం తగలపడిపోతుంటే రోమ్ అవతల ఫిడేల్ వాయిస్తూ గడిపాడని ఒక చారిత్రిక విమర్శ ఉంది.
మన పాలకుల పరిస్థితి కూడా అలానే ఉంది.
మన గౌర్వనీయిలైన CM గారిని స్పందించమంటే అక్కడెక్కడో జరిగిన సంఘటన కి నేనెందుకు స్పందించాలి అన్నారు. మన CM గారు ఇక్కడ ఒక ప్రాథమిక విషయాన్ని మరిచిపోయారు. చిన్నపుడు స్కూల్ స్టార్ట్ అయ్యేది ఒక ప్రతిజ్ఞ తో - "all indians are my brothers and sisters ani......భారతీయులందరూ నా సహోదరులు....". మరి ఈ విషయం మరిచిపోయినట్టున్నారు. లేకపోతే ఢిల్లీ ఏ యుక్రెయిన్ లోనో ఇరాన్ లోనో ఉందని అనుకున్నారో ఆయనకే తెలియాలి. లేక ఏం మాట్లాడితే ఏం వివాదం జరుగుతుందో అని భావించారో .
మన PM గారు నోరు విప్పడానికి వారం రోజులు పట్టింది.
మనల్ని కాపాడాల్సిన మన HM గారిని వెళ్లి ధర్నా చేస్తున్న విద్యార్థులతో మాట్లాడండి అంటే వాళ్ళలో mavoists (నక్సలైట్) లు ఉన్నారేమో అన్నారు......
ఇంక మన PCC అధ్యక్షుడు గారు "ఆడవాళ్ళు అర్ధరాత్రి తిరగడం ఎందుకు స్వతంత్రం వచ్చినంత మాత్రాన" అన్నారు.తర్వాత ఉపసంహరించుకున్నారనుకోండి. 9:30 PM కూడా అర్ధరాత్రా?
ఈ ఘటన సగటు భారతీయుడిని కలచివేసిన కారణం ఇంత అభద్రత లో మనం బతుకుతున్నాం అనే భయం. మరి మన పాలకుల లైట్ గా ఎందుకు తీసుకున్నారు ? వాళ్ళకి,వాళ్ళ బంధువులకి Z-category భద్రత ఉండటమేనా?
మనం పాశ్చాత్య దేశాల నుండి ఒక విషయం నేర్చుకోవాలి - ఒక ఘటన జరిగితే వాళ్ళు స్పందించే తీరు మరియు త్వరగా శిక్షలు అమలు చేసే విధానం .
కెనడా లో 12 నుండి 18 సం . శిక్ష
ఫ్రాన్స్ లో 15 నుండి 30 సం . శిక్ష
న్యూజిలాండ్ లో 12 సం.
జపాన్ లో 10 సం.
UK లో జీవిత కాలం జైలు లో గడపాల్సిందే.
అరబ్ దేశాలలో మరణ శిక్ష.
భారత దేశం లో కూడా sec 376 IPC ప్రకారం 10 సం. శిక్ష. కాని అమలు చేసే విధానం లో జాప్యం.
30 రేప్ కేసు లు 10 సం.నుండి కోర్ట్ తీర్పు కి నోచుకోలేదు. విద్యార్ధులు రోడ్ ల పైకి వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే శిక్షలు తొందరగా అమలు అవుతాయన్న నమ్మకం లేక, న్యాయం జరుగుతుందన్న నమ్మకం సన్నగిల్లడం వల్ల .
"justice delayed is justice denied " - ఈ విషయం మనవాళ్ళు తెలుసుకుని తొందరగా న్యాయం చేస్తే బాగుంటుంది. లేకపోతే జనాలు తిరగబడతారు . కాదు తిరగబడ్డారు .
0 comments:
Post a Comment