వామన:
అసుర రాజైన బలి ప్రహ్లాదుడి ముని మనవడు మరియు మహా విష్ణు భక్తుడు. బలి చక్రవర్తి భూమి ని,పాతాళాన్ని జయించి స్వర్గం పైకి దండెత్తుతాడు . 100 అశ్వమేధ యాగాలు చేస్తే శాశ్వతంగా స్వర్గానికి బాలి రాజవుతాడు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు విష్ణువు ని వేడుకుంటాడు బలి ని అడ్డుకోమని.అపుడు మహా విష్ణువు "బలి సత్ప్రవర్తన గల రాజు, దాన శీలి, పైగా నా భక్తుడు.నేను ఎలా అడ్డుకోగలను" అని ఇంద్రుడికి చెబుతాడు.అపుడు ఇంద్రుడు బలి మంచి రాజైనా, స్వర్గం రాక్షషుల పాలవుతుంది,ఇది శుభ పరిణామం కాదు అని చెబుతాడు.అపుడు విష్ణువు నేను బలి ని చంపను ,అతని శక్తులు హరించను నీ స్వర్గంనుండి మాత్రం పంపిస్తాను అని చెబుతాడు. శ్రీ మహా విష్ణువు వామన(మరుగుజ్జు) రూపం లో పుట్టి బాలి చక్రవర్తి దగ్గరకి దానం తీసుకోడానికి వెళ్తాడు.అసుర రాజైన శుక్రాచార్యుడు ఆ తేజస్సు ని గమనించి అయన శ్రీ మహా విష్ణువు అని గ్రహిస్తాడు.బలి ని అనేక రకాలుగా వారిస్తాడు.బలి ఆయన మాట వినక ఏమి దానం కావాలి అని అడుగుతాడు, అపుడు వామనుడు 3 అడుగుల స్థలం కావాలంటాడు. సభ లో అందరూ నవ్వుతారు.బలి సరే తీసుకోమని చెప్పగా ఒక అడుగు భూమి మీద రెండో అడుగు పాతాళం పైన వేసి మూడో అడుగు ఎక్కడ వెయ్యాలని బలి ని అడుగుతాడు.బలి వామన రపం లో వచ్చింది విష్ణువు అని గ్రహించి తన శిరస్సు పైన మూడో అడుగు వెయ్యమని చెబుతాడు. వామనుడు బలి ని పాతాళానికి తొక్కేస్తాడు.శ్రీ హరి సంతోషించి బలి ని పాతాళాన్నిఏలుకో మని చెప్పి,నువ్వు కీర్తిమంతుడి గా ఎప్పటికీ నిలిచిపోతావని చెబుతాడు.
పరశురాముడు:
పరశు అనగా గొడ్డలి, శివ ప్రసాదం . పరశురాముడు జమదగ్ని మరియు రేణుక ల సంతానం. కార్తవిర అర్జునుడు హైహయ దేశపు రాజు . ఒక సారి రాజు,రాజు సైన్యం జమదగ్ని ఆశ్రమానికి విడిది చేయడానికి వచ్చారు . కామధేనువు సాయం తో జమదగ్ని ఆ రాజు సైన్యానికి విడిది ఏర్పాటు చేయగలిగాడు . అప్పుడు రాజు జమదగ్ని ని అడిగాడు ఇది ఎలా సాధ్యపడిందని. కామధేనువు ని చూపించి అది ఇంద్ర ప్రసాదం అని చెబుతాడు. రాజు కి పాడు బుద్ధి పుట్టి ఆ కామధేనువు ని తస్కరిస్తాడు. పరశురాముడు కోపంతో కార్తవీర్యుడిని చంపి కామధేనువు ని తీసుకువస్తాడు . పరశురాముడు లేని సమయం చూసి కార్తవీర్యుడి కొడుకులు జమదగ్ని ని సంహరించి తల తీసుకువెళ్తారు. ఆ బాధతో తన తల్లి మరణిస్తుంది . పరశురాముడు తల్లి తండ్రుల మరణం విని కోపం తో, కార్తవీర్యుడి కుమారులుని చంపడమే కాక క్షత్రియ వంశాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞబూనుతాడు . 21 క్షత్రియ వంశాల్ని చంపుతాడు. పరశురాముడు చిరంజీవి ఎప్పటికి బతికే ఉంటాడని హిందువులు నమ్ముతారు.
తరవాతి అవతారం రాముడు , కృష్ణుడు, -------
తరువాత బుద్దుడని కొందరు,బలరాముడని కొందరు చెబుతారు.
చివరి అవతారం కల్కి.....ఇది కలియుగావతరం.
కల్కి:
కల్కి తెల్లని గుర్రం పై , జ్వలించే ఖడ్గం పట్టుకుని కలి ని అంతం చేయడానికి వస్తాడు అని అంటారు. యుగాంతం కి కల్కి , కలి ని అంతం చేస్తాడు.
అసుర రాజైన బలి ప్రహ్లాదుడి ముని మనవడు మరియు మహా విష్ణు భక్తుడు. బలి చక్రవర్తి భూమి ని,పాతాళాన్ని జయించి స్వర్గం పైకి దండెత్తుతాడు . 100 అశ్వమేధ యాగాలు చేస్తే శాశ్వతంగా స్వర్గానికి బాలి రాజవుతాడు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు విష్ణువు ని వేడుకుంటాడు బలి ని అడ్డుకోమని.అపుడు మహా విష్ణువు "బలి సత్ప్రవర్తన గల రాజు, దాన శీలి, పైగా నా భక్తుడు.నేను ఎలా అడ్డుకోగలను" అని ఇంద్రుడికి చెబుతాడు.అపుడు ఇంద్రుడు బలి మంచి రాజైనా, స్వర్గం రాక్షషుల పాలవుతుంది,ఇది శుభ పరిణామం కాదు అని చెబుతాడు.అపుడు విష్ణువు నేను బలి ని చంపను ,అతని శక్తులు హరించను నీ స్వర్గంనుండి మాత్రం పంపిస్తాను అని చెబుతాడు. శ్రీ మహా విష్ణువు వామన(మరుగుజ్జు) రూపం లో పుట్టి బాలి చక్రవర్తి దగ్గరకి దానం తీసుకోడానికి వెళ్తాడు.అసుర రాజైన శుక్రాచార్యుడు ఆ తేజస్సు ని గమనించి అయన శ్రీ మహా విష్ణువు అని గ్రహిస్తాడు.బలి ని అనేక రకాలుగా వారిస్తాడు.బలి ఆయన మాట వినక ఏమి దానం కావాలి అని అడుగుతాడు, అపుడు వామనుడు 3 అడుగుల స్థలం కావాలంటాడు. సభ లో అందరూ నవ్వుతారు.బలి సరే తీసుకోమని చెప్పగా ఒక అడుగు భూమి మీద రెండో అడుగు పాతాళం పైన వేసి మూడో అడుగు ఎక్కడ వెయ్యాలని బలి ని అడుగుతాడు.బలి వామన రపం లో వచ్చింది విష్ణువు అని గ్రహించి తన శిరస్సు పైన మూడో అడుగు వెయ్యమని చెబుతాడు. వామనుడు బలి ని పాతాళానికి తొక్కేస్తాడు.శ్రీ హరి సంతోషించి బలి ని పాతాళాన్నిఏలుకో మని చెప్పి,నువ్వు కీర్తిమంతుడి గా ఎప్పటికీ నిలిచిపోతావని చెబుతాడు.
పరశురాముడు:
పరశు అనగా గొడ్డలి, శివ ప్రసాదం . పరశురాముడు జమదగ్ని మరియు రేణుక ల సంతానం. కార్తవిర అర్జునుడు హైహయ దేశపు రాజు . ఒక సారి రాజు,రాజు సైన్యం జమదగ్ని ఆశ్రమానికి విడిది చేయడానికి వచ్చారు . కామధేనువు సాయం తో జమదగ్ని ఆ రాజు సైన్యానికి విడిది ఏర్పాటు చేయగలిగాడు . అప్పుడు రాజు జమదగ్ని ని అడిగాడు ఇది ఎలా సాధ్యపడిందని. కామధేనువు ని చూపించి అది ఇంద్ర ప్రసాదం అని చెబుతాడు. రాజు కి పాడు బుద్ధి పుట్టి ఆ కామధేనువు ని తస్కరిస్తాడు. పరశురాముడు కోపంతో కార్తవీర్యుడిని చంపి కామధేనువు ని తీసుకువస్తాడు . పరశురాముడు లేని సమయం చూసి కార్తవీర్యుడి కొడుకులు జమదగ్ని ని సంహరించి తల తీసుకువెళ్తారు. ఆ బాధతో తన తల్లి మరణిస్తుంది . పరశురాముడు తల్లి తండ్రుల మరణం విని కోపం తో, కార్తవీర్యుడి కుమారులుని చంపడమే కాక క్షత్రియ వంశాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞబూనుతాడు . 21 క్షత్రియ వంశాల్ని చంపుతాడు. పరశురాముడు చిరంజీవి ఎప్పటికి బతికే ఉంటాడని హిందువులు నమ్ముతారు.
తరవాతి అవతారం రాముడు , కృష్ణుడు, -------
తరువాత బుద్దుడని కొందరు,బలరాముడని కొందరు చెబుతారు.
చివరి అవతారం కల్కి.....ఇది కలియుగావతరం.
కల్కి:
కల్కి తెల్లని గుర్రం పై , జ్వలించే ఖడ్గం పట్టుకుని కలి ని అంతం చేయడానికి వస్తాడు అని అంటారు. యుగాంతం కి కల్కి , కలి ని అంతం చేస్తాడు.
0 comments:
Post a Comment